ఎంసెట్ మెడికల్ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో అరెస్ట్ అయిన హైదరాబాద్ చైతన్య కాలేజీ సంస్థల డీన్ వాసుబాబు, ఏజంట్ శివనారాయణలను ఆరురోజులు సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించింది. కనుక శుక్రవారం ఉదయం సిఐడి పోలీసులు వారిరువురినీ అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఎంసెట్ పరీక్షల నిర్వహణకు తెలంగాణా ఉన్నత విద్యా మండలి చాలా జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ వారిరువురూ పరీక్షలకు చాలా రోజులు ముందుగానే ప్రశ్నాపత్రాలను సంపాదించగలిగారు. ఒక్కో విద్యార్ధి నుంచి రూ.35 లక్షలు చొప్పున ఆరుగురు విద్యార్ధుల నుంచి మొత్తం రెండు కోట్లకు పైగా వసూలు చేసి, వారిని భువనేశ్వర్ తీసుకువెళ్ళి ఆ ప్రశ్నాపత్రాలను అందజేసి అక్కడే వారికి రహస్యంగా శిక్షణ ఇచ్చినట్లు సిఐడి పోలీసులు కనుగొన్నారు. ఆ ప్రశ్నా పత్రాలను వారికి ఎవరు ఇచ్చారు? వారిద్దరూ వాటిని ఏవిధంగా సంపాదించగలిగారు? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరున్నారు?వగైరా విషయాలన్నీ విచారణలో బయటపడే అవకాశం ఉంది.