హైదరాబాద్‌లో జపాన్ రూ.1,000 కోట్లు పెట్టుబడి

April 17, 2025
img

జపాన్‌కు చెందిన మారుబేని అనే కంపెనీ హైదరాబాద్‌లో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో ఈ ఒప్పందం జరిగింది. 

ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో భారీ పారిశ్రామికవాడ నిర్మిస్తుంది. దీనిలో జపాన్‌కు చెందిన వివిద పరిశ్రమలు ఏర్పాటవుతాయి. వాటి ద్వారా రాష్ట్రానికి రూ.5,000 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు.

ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్ యంత్రాలు, పరికరాలు, డిఫెన్స్ ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలు వీటిలో ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. 

మారుబేని కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా కంపెనీలున్నాయి. వాటిలో 50 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్న పారిశ్రామికవాడ వాటన్నిటి కంటే చాలా పెద్దది. 

Related Post