శ్రీహరికోట నుంచి కొద్దిసేపటి క్రితం ఇస్రో చేసిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇస్రోకు నమ్మిన బంటువంటి పిస్ఎల్వి ఉపగ్రహవాహక నౌక ద్వారా 3 దేశీయ, 28 విదేశీ ఉపగ్రహాలను వాటి నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టి, ఈ ఏడాదిలో ఇస్రో తొలి విజయం అందుకొంది.