సింగరేణిలో 750 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

September 23, 2017


img

సింగరేణిలో 750 పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీచేయనుంది. వీటిలో మేనేజిమెంట్ ట్రైనీ పోస్టులు: 107 పోస్టులు, మిగిలినవాటిలో ట్రైనీ ఫిట్టర్:288, ఎలక్ట్రీషియన్:143, ట్రైనీ అసిస్టెంట్ ఫోర్ మెన్: 69, టర్నర్, మేషినిస్ట్ ట్రైనీ: 51, ఇంకా ఇతర పోస్టులతో కలిపి మొత్తం: 643 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మేనేజిమెంట్ మరియు కార్మిక స్థాయి పోస్టులన్నీ కలుపుకొని మొత్తం 750 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్ధులు వాటి గురించి పూర్తి వివరాల కోసం సింగరేణి అధికారిక వెబ్ సైట్: www.scclmines.com చూడవచ్చని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. వీటికి ఆన్-లైన్  ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. 

కొన్ని రోజుల క్రితమే సింగరేణిలో 665 ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పుడు మరో 750 పోస్టులకు నోటిఫికేషన్ వస్తోంది. వీటితో కలుపుకొని ఈ మూడున్నరేళ్ళలో మొత్తం 7,198 పోస్టులు భర్తీ చేసినట్లవుతుందని శ్రీధర్ తెలిపారు. 


Related Post