కేసీఆర్ మాటల మనిషి కాదు: జైపాల్ రెడ్డి

September 21, 2017


img

నిశబ్దంగా పనిచేసుకుపోతూ ఫలితాలు చూపేవారిని ‘మాటల మనిషి కాదు చేతల మనిషి’ అంటారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అటువంటివారేనని చాలా మంది భావిస్తుంటారు. సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా దానిని అంగీకరించినప్పటికీ దానినే కాస్త సవరించి కేసీఆర్ మాటల మనిషి కాదు మూటల మనిషి అని ఎద్దేవా చేశారు.      

వికారాబాద్‌ జిల్లా పరిగిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ‘ఇందిరమ్మ రైతుబాట’ కార్యక్రమం నిర్వహించింది. దానిలో పాల్గొన్న జైపాల్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేసీఆర్ మాటల మనిషి కాదు మూటల మనిషిగా మారిపోయారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయలేకపోయినా మిషన్ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు బాకీలు లేకుండా బిల్లులు చెల్లించేస్తుంటారు. ఆయన దృష్టి ఎంతసేపు (డబ్బు) మూటల మీదే ఉంటుంది తప్ప ప్రజలకు ఇచ్చిన మాటల మీద ఉండదు. రైతులకు ద్రోహం చేసిన ఆయనకు వచ్చే ఎన్నికలలో ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు. 


Related Post