త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాల నేపథ్యంలో
యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చేశారు. నల్గొండ
జిల్లాలో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ను ఎట్టి పరిస్థితులలో
తెలంగాణ సీఎం కానివ్వబోమని అన్నారు. ఒకవేళ
కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రంలో పాలనగాడి తప్పుతుందని,
అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంటే
సీఎం కేసీఆర్ మాత్రం తన కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారని రామకృష్ణా
రెడ్డి ఆరోపించారు.
అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు అక్రమంగా ఆస్తులు
కూడబెట్టుకున్నారని, నల్గొండ అభివృద్ధిని గాలికొదిలేశారని
ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో యువ తెలంగాణ పార్టీకి తెరాసతోనే పోటీ అని అన్నారు.
ఈ సమావేశంలో రామకృష్ణారెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్
నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి రాణిరుద్రమ, ఉమ్మడి
నల్గొండ జిల్లా యువ తెలంగాణ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.