జనవరి 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు కేంద్రప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 29 ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. మరుసటిరోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు తొలివిడత సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ 2021-2022 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు బడ్జెట్పై చర్చిస్తారు.
మళ్ళీ మార్చి 8 నుంచి రెండో విడత సమావేశాలు మొదలవుతాయి. ఏప్రిల్ 8వరకు సాగే ఆ సమావేశాలలో బడ్జెట్ కేటాయింపులపై మరోసారి చర్చించి ఆమోదం తెలుపుతారు.