హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన మాధవి అనే మహిళ తన భర్త బ్రతికున్నాడా లేడా?తెలపాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల క్రితం తన భర్త అల్లం మధుసూధన్కు కరోనా సోకడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది గాంధీ ఆసుపత్రిలో చేర్చారని, అప్పటి నుంచి నేటి వరకు తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం తనకు తెలియజేయలేదని, కనుక తన భర్త బ్రతికున్నాడా లేడా?తెలపాలని ఆ మహిళా కోరింది.
దానిపై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టగా ‘ఆమె భర్త కరోనాతో మృతి చెండాడని, ఆ విషయం ఆమెకు కూడా తెలియజేసి, జీహెచ్ఎంసీ సిబ్బందితో అంత్యక్రియలు కూడా నిర్వహించామని ప్రభుత్వం తరపు వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. మరైతే ఆమె భర్త చనిపోయిన విషయం తెలియజేస్తూ డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని న్యాయస్థానం అడ్వకేట్ జనరల్ను నిలదీసింది. రేపు మళ్ళీ ఈకేసుపై విచారణ చేపట్టినప్పుడు ‘డెత్ సర్టిఫికేట్’ తో రావలసిందిగా ఆదేశించింది.