తూర్పుగోదావరిలో ఘోర రోడ్డుప్రమాదం

October 15, 2019


img

తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి మారేడుమిల్లికి పర్యాటకులతో వస్తున్న మినీబస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 12-15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు, సహాయసిబ్బంది చేరుకొని గాయపడినవారిని రంపచోడవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబందించి మృతులు, గాయపడినవారి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.    



Related Post