నల్లమల అడవులలో యురేనియం త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ వివిద రంగాలకు చెందిన ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కూడా ట్వీట్ చేశారు. అయితే దానిలో తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న అని పేర్కొనడంతో ఆమె ట్వీట్ బ్యాక్ ఫైర్ అయ్యింది.
ఇంతకీ అనసూయ ఏమి ట్వీట్ చేశారంటే, “ఇదేగా మన ఫ్యూచర్? ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా? ఆలోచించటానికే భయమేయడంలేదా? శ్రీ@జోగురామన్న టీఆర్ఎస్, శ్రీ @బాలినేని శ్రీనివాస్, శ్రీ@ప్రకాష్ జవడేకర్.. సర్....దయచేసి ఆవిధంగా చేయొద్దు. మనం జీవించాలంటే (ప్రకృతి, జంతువులు, పక్షులతో) కలిసి జీవించాలి. #సేవ్ నల్లమల..” అని ట్వీట్ చేశారు.
జోగు రామన్న మంత్రికాదని తెలియక మంత్రి అని అనసూయ సంభోదించడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అది చూసి ఆమె మళ్ళీ మరో ట్వీట్ చేశారు.
“శ్రీ జోగు రామన్న టిఆర్ఎస్ను తప్పుగా ట్యాగ్ చేసినందుకు క్షమాపణలు. కరెంట్ ఎఫైర్స్ గురించి తెలియకపోవడంతో ఆ పొరపాటు జరిగింది. ఈవిధంగా జరుగుతుందని ఊహించలేదు. సర్...శ్రీ@ఇంద్రకరణ్ రెడ్డి అల్లోలగారు దయచేసి నా ట్వీట్లో ఉద్దేశ్యాన్ని గమనించగలరు వేరేవి కాదు,” అని ట్వీట్ చేశారు.