సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన భార్య పద్మినీ రెడ్డి ఇద్దరూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. అమిత్ షా శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ రానున్నారు. శనివారం ఉదయం నేషనల్ పోలీస్ అకాడమీ కేంద్రహోంమంత్రి హోదాలో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటారు. కనుక దామోదర దంపతులు ఈరోజు రాత్రి లేదా రేపు మధ్యాహ్నం గానీ అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతునట్లు తెలుస్తోంది. వారితో పాటు మరికొందరు కాంగ్రెస్, టిడిపి నేతలు కూడా బిజెపి కండువాలు కప్పుకోబోతునట్లు సమాచారం. దామోదర దంపతులు బిజెపిలోకి వెళ్ళిపోయినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ తీవ్ర నష్టం కలిగించడం ఖాయం.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పద్మినీ రెడ్డి బిజెపిలో చేరారు. కానీ భర్త ఒత్తిడితో అదే రోజు సాయంత్రం మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి బిజెపిలో చేరబోతున్నారు.