ఈ నెల 18, 19 తేదీలలో శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. కనుక ఒకరోజు ముందుగా జూలై 17న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొత్త పురపాలక చట్టంపై చర్చించి ఆమోదం తెలుపుతారు. జూలై 18న దానిని శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. మొదటిరోజున దానిపై ఉభయసభలలో చర్చించి మరుసటిరోజున దానికి ఆమోదముద్రవేస్తారు. ఉభయసభల ఆమోదంతో అది చట్టంగా మారుతుంది. ఆ కొత్త చట్టం ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి.