ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం అమరావతిలోని రాష్ట్ర శాసనసభలో 2019-20 సం.లకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 కోట్లు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు. రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు. ద్రవ్యలోటు సుమారు రూ.35,260 కోట్లు. వడ్డీ చెల్లింపుల కోసం కేటాయించినది రూ. 8,994 కోట్లు.
సంక్షేమ పధకాలకు కేటాయింపులు:
• వృద్ధులు, వితంతువుల పెన్షన్లకు: రూ.12,801 కోట్లు
• దివ్యాంగుల పెన్షన్లకు: రూ.2,133.62 కోట్లు
• ఒంటరి మహిళల పెన్షన్లకు: రూ.300 కోట్లు
• వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి: రూ.1,740 కోట్లు
• వైఎస్సార్ గృహ వసతి పథకానికి: రూ.5,000 కోట్లు
• డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు: రూ.1,140 కోట్లు
• పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు: రూ.648 కోట్లు
• దళితుల అభివృద్ధికి: రూ. 15,000 కోట్లు
• వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి: రూ. 1,561 కోట్లు
• గిరిజనుల అభివృద్ధికి: రూ.4,988 కోట్లు
• మైనారిటీల అభివృద్ధికి: రూ.952 కోట్లు
• అగ్రిగోల్డ్ బాధితులకు: రూ.1,150 కోట్లు
• చేనేత కార్మికులకు: రూ.200 కోట్లు
• ఆశా వర్కర్లకు: రూ.455.85 కోట్లు
• అమ్మఒడి పథకానికి: రూ.6,455 కోట్లు
• మధ్యాహ్న భోజన పథకానికి: రూ.1,077 కోట్లు
• వైఎస్సార్ రైతు భరోసాకు: రూ.8,750 కోట్లు
• రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్కు: రూ.4,525 కోట్లు
• వైఎస్సార్ రైతు బీమాకు: రూ.1,163 కోట్లు
• రైతుల ఉచిత బోర్లకు: రూ.200 కోట్లు
• ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి: రూ.475 కోట్లు
విద్యారంగానికి కేటాయింపులు:
• ఉన్నత విద్య: రూ. 3,021.63 కోట్లు
• పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు: రూ.160 కోట్లు
• పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి: రూ.1,500 కోట్లు
వ్యవసాయం:
• ధరల స్థిరీకరణ నిధికి: రూ.3,000 కోట్లు
• ప్రకృతి విపత్తుల నివారణ నిధికి: రూ.2,002 కోట్లు
• వ్యవసాయం, అనుబంధ రంగాలకు: రూ.20,677 కోట్లు
• గ్రామీణాభివృద్ధికి: రూ.29,329 కోట్లు
• సాగునీరు, వరద నివారణకు: రూ.13,139 కోట్లు
• రైతులకు విత్తనాల పంపిణీ చేసేందుకు:రూ.200 కోట్లు