హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

June 20, 2019


img

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం కులు జిల్లాలో బంజర్ అనే ఊరు నుంచి గడగుషాని అనే ఊరుకి వెళుతున్నప్పుడు కొండపై నుంచి పక్కనే 300 అడుగుల లోతుగల లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో 25 మంది మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షత గాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బంజర్ నుంచి బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్డులో బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 



Related Post