తెలంగాణ బిజెపి లోక్‌సభ అభ్యర్ధుల 2వ జాబితా

March 23, 2019


img

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న ఆరుగురు అభ్యర్ధుల జాబితాను బిజెపి శనివారం సాయంత్రం విడుదల చేసింది. దీంతో కలిపి మొత్తం 16 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. మెదక్‌ అభ్యర్ధి పేరు ఇంకా ప్రకటించవలసి ఉంది.  

ఈరోజు ప్రకటించిన జాబితాలో  చేవెళ్ల: బి.జనార్థన్‌, పెద్దపల్లి: ఎస్‌.కుమార్‌, హైదరాబాద్‌: భగవంత్‌ రావు, ఖమ్మం: వాసుదేవ రావు, ఆదిలాబాద్‌: సోయం బాబూరావు, జహీరాబాద్‌: బాణాల లక్ష్మారెడ్డి ఉన్నారు.

గురువారం ప్రకటించిన జాబితాలో సికింద్రాబాద్‌: కిషన్‌ రెడ్డి, మల్కాజిగిరి: ఎన్‌ రామచంద్రరావు, మహబూబ్‌నగర్‌: డీకే అరుణ, నిజామాబాద్‌: డి. అరవింద్‌, కరీంనగర్‌: బండి సంజయ్‌, నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్‌, భువనగిరి: పీవీ శ్యామ్‌సుందర్‌ రావు, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ): బంగారు శ్రుతి, మహబూబాబాద్‌: హుస్సేన్‌నాయక్‌, వరంగల్‌: చింతా సాంబమూర్తి ఉన్నారు. 


Related Post