తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ నరసింహన్కు ఈ విషయం స్వయంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది కనుక ఇప్పుడు ఎవరెవరికి మంత్రిపదవులు లభిస్తాయనేదానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు, డిఎస్ రెడ్యానాయక్, పల్లా రాజేశ్వర్రెడ్డి, పద్మా దేవేందర్రెడ్డిలకు ఈసారి మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.