ఆ కేసు ముగిసింది: హైకోర్టు

July 17, 2018


img

తెలంగాణా రాష్ట్ర రైతురుణవిమోచన కమీషన్ ఏర్పాటుపై భాజపా మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి వేసిన కేసును మూసివేసిన్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధకృష్ణన్, నాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ లతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రకటించింది. 

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ ను ఏర్పాటు చేసింది కానీ దానికి చైర్మన్, పాలకమండలిని ఏర్పాటు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనని ఇంద్రసేనారెడ్డి ఒక పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ చైర్మన్ గా నాగుర్ల వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాపీని ప్రభుత్వ న్యాయవాది శరత్ కుమార్ సోమవారం హైకోర్టుకు సమర్పించడంతో ఇంద్రసేనారెడ్డి వేసిన కేసును మూసివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. 



Related Post