ఆయనకు కోతలు తప్ప పాలన తెలియదు: షబ్బీర్ అలీ

May 25, 2018


img

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో మరెక్కడా లేనివిధంగా మేమే చేశామని , భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పధకం గురించి కెసిఆర్ గొప్పలు చెప్పుకున్నారు. అంతేగాక దేశంలో ఇతర రాష్ట్రాలలో న్యూస్ పేపర్లలో వాటి గురించి ప్రచారం చేసుకునేందుకు కెసిఆర్ ఫోటో తో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? సుమారు 10 లక్షల రైతుల పాసు పుస్తకాలలో తప్పులు దొర్లాయని సిఎం కెసిఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తప్పులు జరిగాయని అయన ఇప్పుడు అధికారులను నిందిస్తున్నారు. నిజానికి అధికారులది తప్పు కాదు. సిఎం కెసిఆర్ దే తప్పు. ఆయనకు       కోయడమే తప్ప పరిపాలన చేతకాదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనివాదించే రకం ఆయన. అందుకే పదేపదే అభాసుపాలవుతున్నారు,” అని అన్నారు.



Related Post