రాష్ట్రంలో 7 కొత్త జోన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మొట్టమొదట స్పందించారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా, కంది మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించిన తరువాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో జోన్ల పునర్వ్యవస్థీకరణ చాలా తొందరపాటు చర్య. ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వలన ఉద్యోగులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. జోన్ల వ్యవస్థపై అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. త్వరలో జరుగబోయే పంచాయితీ ఎన్నికలలో టిజేఎస్ పార్టీ పోటీ చేస్తుంది,” అని అన్నారు.