పాలమూరు ప్రాజెక్టులో ప్రమాదం

May 23, 2018


img

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగం పనులలో బుధవారం ప్రమాదం జరిగింది. కొల్లాపూర్ మండలంలో ఎల్లూరు వద్ద సొరంగం లోపల జరిగిన ప్రేలుడులో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతులు, గాయపడిన వారందరూ బిహార్, కర్ణాటకకు చెందినవారే. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.         



Related Post