మంత్రి కేటిఆర్ బుధవారం డిల్లీ వెళుతూ మద్యలో లక్నోలో కాసేపు ఆగి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. ఇదివరకు అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కేటిఆర్ ను లక్నో రావలసిందిగా ఆహ్వానించారు. అప్పటి నుంచి వారిరువురి మద్య స్నేహం చిగురించింది. బహుశః అందుకే మంత్రి కేటిఆర్ లక్నో వెళ్ళి అఖిలేష్ యాదవ్ ను కలిసి ఉండవచ్చు. అయితే కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు కనుక అది విజయవంతం కావాలంటే దానికి ఉత్తరాది రాష్ట్రాలలో కీలకమైన యూపిలో రాజకీయపార్టీల సహకారం చాలా అవసరం. కనుక ఆ ప్రయత్నాలలో భాగంగానే యూపిలో బలమైన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కలిసి ఉండవచ్చు. కెసిఆర్ తన స్థాయిలో సీనియర్ ప్రతిపక్ష నేతలను కలుస్తుంటే, కేటిఆర్ తన వయసున్న యువనేతల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారేమో?