ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం కుటుంబ సభ్యులందరితో కలిసి మహారాష్ట్ర, షిరిడిలోగల షిరిడిసాయిబాబాను దర్శించుకొన్నారు. ఆలయంల్ కెసిఆర్, కుటుంబ సభ్యులు ప్రత్యేకపూజలు చేసిన తరువాత ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు మళ్ళీ ఈరోజు రాత్రిలోగా హైదరాబాద్ తిరిగిరానున్నారు.