బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈరోజు సాయంత్రం 7 గంటలకు ‘సిఎం టార్గెట్’ పేరుతో పోడ్ కాస్ట్ ద్వారా కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు టీవీ5 న్యూస్ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. టీవీ5 జర్నలిస్ట్ మూర్తి ఆమెను ఇంటర్వ్యూ చేశారు.
“ట్యాపింగ్ జరిగిందా?దయ్యం ఎవరు?జాగృతి ప్లానెంటీ?అలాగే ఎన్నో రహస్యాలు!” అంటూ ఆమె ఇంటర్వ్యూ దేని గురించో టీవీ5 ఎక్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలతోనే రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఈరోజు ఇంటర్వ్యూలో ఇంకెన్ని బాంబులు పేలుస్తారో.. ఏమో?
ట్యాపింగ్ జరిగిందా? దయ్యం ఎవరు? జాగృతి ప్లానెంటీ? అలాగే ఎన్నో రహస్యాలు! #BRS #KavithaSpeaks #TV5Murthy #TelanganaPolitics #ExclusiveInterview #TelanganaNews #PoliticalTalk #KCR #KTR pic.twitter.com/yuURXvVbIK