తెలంగాణలో ఇంటర్మీడియేట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి. అప్పటి నుంచి విద్యార్ధులు సెలవుల్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు సిద్దం అవుతున్నారు.
ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని ఇదివరకే ఇంటర్ బోర్డు ప్రకటించినందున విద్యార్ధులు అందరూ ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చివరికి వారు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.
ఈ నెల 22 వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇంటర్ ఫలితాలు ప్రకటించిన వెంటనే ఫెయిల్ అయిన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.