గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, “మరొక వారం రోజులలోపుగా గ్రూప్-2 ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. కాగానే ఫలితాలు వెల్లడించబోతున్నాము. వాటితో కలిపి టీఎస్పీఎస్సీ అధ్యవర్యంలో ఇంతవరకు 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లవుతుంది. వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ న్యాయవివాదాల కారణంగా ఆలస్యం జరుగుతోంది. త్వరలోనే అవి పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాము,” అని చెప్పారు.