తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు మే 11 (ఆదివారం) విడుదల కాబోతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఫలితాలు విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. వాటితో పాటే విద్యార్ధుల ర్యాంకులు, మార్కుల జాబితాలు కూడా విడుదల చేస్తారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులలో ప్రవేశాల కొరకు ఏప్రిల్ ఎస్ఎస్ఎంబీ29 నుంచి మే 4వరకు ఎప్ సెట్ పరీక్షలు జరిగాయి. దాదాపు మూడు లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు వెలువడగానే వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెడతామని అధికారులు తెలిపారు.