గోపీచంద్ భీమా ఫస్ట్ లిరికల్ ఏదో మావయ్య మావయ్యా...

February 09, 2024


img

గోపీచంద్, మాళవిక శర్మ, భవానీ శంకర్ హీరోయిన్లుగా ‘భీమా’ సినిమా మార్చి 8న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ‘ఏదో ఏదో మావయ్యా...’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ప్రమో నిన్న విడుదల చేశారు.

ఈరోజు పూర్తి సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం చేస్తున్నారు. గోపీచంద్‌కు చాలా కాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపై చాలా ఆశపెట్టుకున్నాడు. 

దీనిలో గోపీచంద్‌ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అటువంటి ఓ పోలీస్ ఆఫీసర్ ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏవిదంగా ఉంటుందో తాజాగా విడుదల చేసిన ఈ పాటతో చక్కగా చూపించారు.

ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేలానే ఉంది. భీమా కమర్షియల్ సినిమా అయినప్పటికీ దీంతో గోపీచంద్‌ హిట్ కొట్టే అవకాశం కనిపిస్తోంది. కళ్యాణ్ చక్రవర్తి వ్రాసిన ఈ పాటను రవి బస్రూర్ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 

భీమాలో నాజర్, రఘుబాబు, వెన్నెల కిషోర్, నరేష్, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర, రోహిణి, పూర్ణ, నిహారిక ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష, సంగీతం: రవి బస్రూర్, కొరియోగ్రఫీ: డాక్టర్ రవి వర్మ, కెమెరా: స్వామి జె గౌడ, స్టంట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. భీమా సినిమాని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష