చిరంజీవి రిస్క్ తీసుకుంటున్నారా?

July 24, 2024


img

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానాన్ని రాజకీయాలలోకి రాక ముందు తర్వాత అని రెండుగా విభజించి చూస్తే, మొదటి దశతో పోలిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశ అంత అద్భుతంగా లేదనే చెప్పక తప్పదు.

చిరంజీవి తన ఇమేజ్‌ చట్రంలో బందీ అయిపోవడం, వయసు, ఇంకా అనేక పరిమితులు కారణంగా మొదటి దశ సినిమాలలో దూకుడుగా వ్యవ్హరించలేకపోతున్నారు. ఇది చాలా సహజమే. కనుక చాలా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆచార్య వంటి డిజాస్టర్స్ తప్పడం లేదు.

వాల్తేర్ వీరయ్యతో ఎలాగో ఒడ్డున పడిన చిరంజీవి తర్వాత మల్లాది వశిష్టతో విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి సోషియో ఫ్యాంటసీ సినిమా అనగానే ఆనాడు శ్రీదేవితో కలిసి చేసిన జగదేక వీరుడు-అతిలోక సుందరి సినిమా కళ్ళ ముందు మెదులుతుంది. కనుక అభిమానులు, ముఖ్యంగా ప్రేక్షకులు ఆ సినిమాతో ‘విశ్వంభర’ బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఏ మాత్రం తేడా రావడానికి వీల్లేదు. మల్లాది వశిష్ట విశ్వంభర అందరినీ మెప్పించారు కనుక చిరంజీవితో అంత కంటే ఎక్కువే మెప్పిస్తారని భావించవచ్చు. 

అయితే విశ్వంభర తర్వాత చిరంజీవి మళ్ళీ దర్శకుడు మోహన్ రాజాతో సినిమాకి ఒకే చెప్పారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేసిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

అందుకు చిరంజీవి, మోహన్ రాజాలను తప్పు పట్టలేము. మళయాళీలు అలాంటి సినిమాలను ఇష్టపడతారు కానీ తెలుగు ప్రేక్షకులకు రుచించవు. కనుక సినిమా ఆకట్టుకోలేకపోయి ఉండవచ్చు. కానీ ఆ అనుభవం తర్వాత కూడా చిరంజీవి మళ్ళీ మోహన్ రాజాతో సినిమాకు సిద్దపడుతుండటం అభిమానులకు ఆందోళన కలిగించేదే.

చిరంజీవి రెడీ అంటే ఆయన ఇమేజ్‌కి తగ్గట్లు సినిమాలు తీసేందుకు ఎంతోమంది ప్రముఖ దర్శకులు సిద్దంగా ఉన్నారు. కాని వారిని కాదని మళ్ళీ మోహన్ రాజాతో సినిమాకి చిరంజీవి ఎందుకు సిద్దపడ్డారో తెలీదు. ఈ సినిమాకి బీవీఎస్ రవి కధ అందిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష