గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్తో సిద్దం అవుతున్న మాస్ మసాలా మూవీ వీరసింహా రెడ్డి. ఈ సినిమాలో వీరసింహారెడ్డిగా నటిస్తున్న బాలయ్యని ఎలివేట్ చేస్తూ సాగే ‘జై బాలయ్య... రాజసం నీ ఇంటి పేరు... పౌరుషం నీ ఒంటి తీరు..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ని ఈరోజు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు.
నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సుమారు రూ.70 కోట్లు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.