అర్దరాత్రి వరకు హైదరాబాద్‌ మెట్రో సేవలు

April 02, 2025
img

ఏప్రిల్ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌ మెట్రో సేవలు అర్దరాత్రి 12 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కనుక అర్దరాత్రి 12 గంటలకు మెట్రో చివరి సర్వీసు లభిస్తుంది కనుక అది చివరి స్టేషన్‌ చేరుకునే వరకు అంటే సుమారు గంట వరకు నగరంలో మెట్రో రైళ్ళు అందుబాటులో ఉంటాయన్న మాట! 

ఉదాహరణకు మియాపూర్ నుంచి అర్దరాత్రి 12 గంటలకు చివరి సర్వీసు ప్రారంభమైతే అది అమీర్ పేట చేరుకునేలోగా దారిలో అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు దానిలో ప్రయాణించవచ్చు. 

ప్రస్తుతం మెట్రోలో అన్ని మార్గాలలో కలిపి రోజుకి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు మరో అర్దగంటసేపు మెట్రో సర్వీసులు పెంచడం వలన మరికొన్ని వేలమంది ప్రయాణించగలుగుతారు. వారి వలన మెట్రోకి కొద్దిపాటి ఆదాయం లభిస్తుంది.

కానీ రాత్రి ఒంటి గంటన్నర వరకు మెట్రో రైళ్ళు పట్టాలపై ఉంటూ మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకే బయలుదేరుతుండటం వలన రైల్వే బోగీలు క్లీనింగ్, ట్రాక్ మరమత్తులకు సమయం తగ్గిపోతుంది. కనుక మరింత వేగంగా మరమత్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

Related Post