దుబాయ్ నుంచి వచ్చేశారు... అయితే మొదలు పెట్టేస్తారా?

April 19, 2024


img

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం దుబాయ్ వెళ్ళిన రాజమౌళి, మహేష్‌ బాబు బృందం హైదరాబాద్‌ తిరిగివచ్చింది. 

వారు హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగినప్పుడు అక్కడే ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలను క్లిక్ మనిపించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేశారు. 

ఈ సినిమాలో మహేష్‌ బాబుని ఏవిదంగా చూపించాలనే దానిపై ఇప్పటికే ఆర్టిస్టులు 6-7 చిత్రాలు సిద్దం చేశారు. వాటిలో రెండింటిని రాజమౌళి, మహేష్‌ బాబు ఇద్దరూ ఒకే చేసిన్నట్లు తెలుస్తోంది. ఆ గెటప్‌ని ప్రయత్నించేందుకు వారు దుబాయ్ వెళ్లిన్నట్లు తెలుస్తోంది. 

మహేష్‌ బాబు తాజా ఫోటో చూస్తే బహుశః ఇదే ఆ కొత్త గెటప్ అని అందరూ అనుకొంటున్నారు. గుంటూరు కారం సినిమాతో పోలిస్తే పూర్తి డిఫరెంట్‌గా కనిపిస్తున్న మహేష్‌ బాబుని చూసి అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. అయితే రాజమౌళి ఈ సినిమాకి సంబందించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. 

దుబాయ్‌లో పనులు ముగించుకొని హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు కనుక త్వరలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. 

సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ మాదిరిగా ఈ సినిమాని తీయబోతున్నట్లు ఈ సినిమాకు కధ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. బహుశః జూలై లేదా ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.            



Related Post

సినిమా స‌మీక్ష