సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న యానిమల్ తెలుగు వెర్షన్ నుంచి నాన్న నువ్వే నా ప్రాణం పాట విడుదల చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, సురేశ్ ఓబ్రాయ్, ప్రేమ్ చోప్రా, తృప్తీ దిమ్రీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో సాగే ఈ సినిమాకి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటం, దానిలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండటం విశేషమే.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగా, కెమెరా: అమిత్ రాయ్, సంగీతం: హర్షవర్ధన్, రామేశ్వర్ చేస్తున్నారు. సుమారు వంద కోట్ల భారీ బడ్జెట్తో టీ-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ ఒన్ స్టూడియోస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృశాన్ కుమార్, మురాద్ కేటాని, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.