మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఎస్ఎస్ఎంబీ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సినీ నిర్మాణసంస్థ హారిక & హాసిని క్రియెషన్స్ సోమవారం ప్రకటించింది. దీంతోపాటు ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా విడుదలచేసింది. దీనిలో మహేష్ బాబు సిగరెట్ కాల్చుతూ ముందు నడుస్తుంటే వెనుక నుంచి ఓ లారీ, మరో వైపు ఓ కార్ వస్తున్నట్లు చూపారు. ఏదో ఫైటింగ్ సీన్ జరిగిన తర్వాత హీరోని చూసి భయపడుతూ రోడ్డు కిరువైపులా చేతులు జోడించి మోకాళ్ళపై కూర్చొన్నట్లు కొందరిని చూపారు.
ఈ సినిమాలో నటిస్తున్నారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు “అసుర సంధ్యవేళ” అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఇంకా ధృవీకరించవలసి ఉంది
ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.
The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH
— Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023