భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త పెళ్ళి కూతురు ఆత్మహత్య

April 23, 2024


img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండు మండలంలోని మంగయ్య బంజర్ గ్రామానికి చెందిన దేవకి (23) ఇటీవల బీఎస్సీ పూర్తిచేసింది. ఆమె తల్లితండ్రులు పద్మ, శ్రీను నిరుపేద వ్యవసాయ కూలీలు.

అయినప్పటికీ అతికష్టం మీద కూతురిని బీఎస్సీ వరకు చదివించారు. గత కొంతకాలంగా ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఆమె తల్లితండ్రులు ఆమెకు త్వరగా పెళ్లిచేయాలనుకున్నారు.

కానీ తనకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని తాను ఇంకా ఉన్నత చదువులు చదువుకుంటానని దేవకి పట్టుబట్టింది. కానీ వారు ఎలాగో కూతురికి నచ్చజెప్పుకొని దుబ్బతండా గ్రామానికి చెందిన ఓ యువకుడితో మార్చి 28న పెళ్ళి చేశారు. 

పెళ్ళైన తర్వాత నూతన దంపతులు తొలిసారిగా పదహారు రోజుల పండుగ కోసం దేవకి పుట్టింటికి వచ్చారు. ఈ నెల 14వ తేదీ రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా దేవకి ఇంట్లో ఉన్న పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. కానీ మర్నాడు తెల్లవారుజామున ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. ఇంతకీ తప్పు తల్లితండ్రులదా లేక ఆమెదా?


Related Post