సిఎం రేవంత్ రెడ్డి ఊహించిన దానికంటే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియంపబడిన 8 మండి సలహాదారులను, నలుగురు ప్రత్యేక అధికారులను తక్షణం పదవులలో నుంచి తొలగించారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
తొలగింపబడిన ప్రభుత్వ సలహాదారులు:
రాజీవ్ శర్మ, చెన్నమనేని రమేష్: ప్రభుత్వ ప్రధాన సలహాదారులు
సోమేశ్ కుమార్: సిఎం ముఖ్య సలహాదారు
అనురాగ్ శర్మ: హోంశాఖ సలహాదారు
కేవీ రమణాచారి: దేవాదాయ, సాంస్కృతిక సలహాదారు
ఏకే ఖాన్: ముస్లిం మైనార్టీ సంక్షేమ సలహాదారు
శోభ: అటవీ సంరక్షణ సలహాదారు
శ్రీనివాసరావు: ఉద్యానవన శాఖ సలహాదారు
తొలగింపబడిన ప్రత్యేకాధికారులు:
సుధాకర్ తేజ: ఆర్ అండ్ బి స్పెషల్ ఆఫీసర్
జీఆర్ రెడ్డి, శివశంకర్: ఆర్ధిక శాఖ స్పెషల్ ఆఫీసర్స్
రాజేంద్ర ప్రసాద్ సింగ్: ఇంధన సెక్టర్ స్పెషల్ ఆఫీసర్.