తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకొని హోమ్ క్వారెంటైన్లో ఉంటున్నారు. గత వారం పదిరోజులుగా తనను కలిసినవారందరూ కూడా తక్షణమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మూడు నాలుగు రోజుల క్రితం టిఆర్ఎస్ నేతలు గండ్ర వెంకటరమణ దంపతులకు కరోనా సోకడంతో ప్రస్తుతం వారు క్వారెంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో గత ఏడాది మొదటిసారి కరోనా ప్రవేశించిన తరువాత అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కరోనా బారినపడి కోలుకొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తరువాత కూడా ఇంకా మంత్రులు, పార్టీ నేతలు కరోనాకు గురవుతుండటం ఆశ్చర్యకరమే. అధికారిక కార్యక్రమాలలో భాగంగా వారు నిత్యం అనేకమందిని కలుస్తుంటారు. బహుశః అటువంటప్పుడే ఎవరి ద్వారానో మంత్రులకు కూడా కరోనా సోకుతుండవచ్చు.