నేడు, రేపు టిఎస్ఎంసెట్ ఏఏం పరీక్షలు

July 30, 2022
img

భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు శని, ఆదివారాలలో జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు ఒక సెషన్, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష వ్రాసేందుకు అనుమతించారు. ఈ పరీక్షలకు మొత్తం 94,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరికోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 68, ఆంధ్రప్రదేశ్‌లో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల ప్రాధమిక కీ నేడు విడుదల కానుంది.  


Related Post