పరశురాంతో మంచు హీరో మూవీ..!

August 16, 2018


img

గీతా గోవిందం సినిమాతో దర్శకుడిగా మరోసారి తన సత్తా చాటిన పరశురాం టాలీవుడ్ లో మరో క్రేజీ దర్శకుడిగా మారాడని చెప్పొచ్చు. విజయ్, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పరశురాం మంచు విష్ణుతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మోహన్ బాబు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందట. 

గీతా గోవిందం హిట్ తో గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు. మరోపక్క మైత్రి మూవీస్ తో పరశురాం సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ రెండిటి కన్నా ముందు పరశురాం మంచు ఫ్యామిలీతో సినిమా చేస్తున్నాడు. గీతా గోవిందం హిట్ టాక్ రావడంతో మంచు ఫ్యామిలీ పరశురాం తో సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా తర్వాతనే పరశురాం మిగతా కమిట్మెంట్ చేస్తాడని అంటున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష