నందమూరి హీరో స్పీడ్ పెంచాడు..!

April 25, 2018


img

నందమూరి హీరోల్లో ఎన్.టి.ఆర్ తర్వాత యువ హీరోగా తన సత్తా చాటుతున్న కళ్యాణ్ రాం రీసెంట్ గా ఎం.ఎల్.ఏ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఇక జయేంద్ర డైరక్షన్ లో చేస్తున్న నా నువ్వే సినిమా మే నెలలో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రాం మరో సినిమా మొదలు పెట్టారు. సినిమాటోగ్రఫర్ గుహన్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.


ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఈరోజు ఉదయం జరిగాయి. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో పాటుగా నందమూరి హరికృష్ణ, రామకృష్ణ లు కూడా అటెండ్ అయ్యారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్స్ గా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే, మలయాళ భామ నివేథా థామస్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. 

 


Related Post

సినిమా స‌మీక్ష