జమ్ము కశ్మీర్లో మంగళవారం మద్యాహ్నం జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య 28 కి పెరిగింది. వారిలో కోఠి, హైదరాబాద్లో సబ్సిడరీ ఇంటలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసరుగా పనిచేస్తున్న మనీష్ నిరంజన్ కూడా ఉన్నారు.
బిహార్కు చెందిన ఆయన చాలా ఏళ్ళుగా హైదరాబాద్లో పని చేస్తూ నగరంలోనే స్థిరపడ్డారు. పిల్లలకు వేసవి సెలవులు మొదలవడంతో కుటుంబ సమేతంగా విహారయాత్రకని జమ్ము కశ్మీర్ వెళ్ళి అక్కడ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదులు తన భర్త ఐడీ కార్డ్ చూసిన తర్వాత కాల్చి చంపారని, కానీ తమని విడిచి పెట్టారని ఆయన భార్య చెప్పారు. ఉగ్రవాదుల కాల్పులు జరుపుతున్నట్లు తెలుసుకొని భద్రతా దళాలు అక్కడకు చేరుకునే సరికే వారు సమీపంలో గల అడవులలోకి తప్పించుకు పారిపోయారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత్లో పర్యటిస్తున్నప్పుడే ఈ ఘటన జరగడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందిస్తూ ఈ దుశ్చర్యని ఖండించారు.
డోనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ భారత్కు అండగా ఉంటామని, ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్కు సాయపడేందుకు అమెరికా సిద్దంగా ఉందన్నారు.