ధనుష్, ఐశ్వర్యల విడాకుల కేసు అక్టోబర్ 7న

April 16, 2024
img

ప్రముఖ తమిళ సినీ నటుడు ధనుష్, ఐశ్వర్య (రజినీకాంత్ కుమార్తె) ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయి సంగతి తెలిసిందే. వారిరువురూ తమకు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ చేపట్టిన్న న్యాయస్థానం అక్టోబర్ 7వ తేదీన ఇద్దరూ విచారణకు హాజరుకావలని ఆదేశించింది. 

వారు 2004లో వివాహం చేసుకున్నారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఇంతకాలం అన్యోన్యంగా కాపురం చేసిన ధనుష్, ఐశ్వర్యల మద్య గత కొంత కాలం నుంచి మనస్పర్థలు ఏర్పడటంతో గత ఏడాది తాము విడిపోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

ఆ తర్వాత ఐశ్వర్య పిల్లలతో తల్లితండ్రులకు తిరిగి వచ్చేయగా, ధనుష్ వేరే ఉంటున్నాడు. వారిద్దరినీ మళ్ళీ కలపడానికి రజినీకాంత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినప్పటికీ వారు మళ్ళీ ఆలోచించుకోవడానికి తగినంత సమయం ఇస్తూ అక్టోబర్ 7న ఇద్దరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Related Post