ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే

April 12, 2024
img

ప్రముఖ నటుడు సాయాజీ షిండేకు గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్ర, సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు గుండె కుడివైపు 99 శాతం నరాలు పూడుకుపోయిన్నట్లు గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి మూసుకుపోయిన రక్తనాళాలను తెరుచుకునేలా చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేసి పంపించేస్తామని చెప్పారు. 

సాయాజీ షిండే మహారాష్ట్రలో నాటక రంగం నుంచి మరాఠీ, హిందీ సినీ రంగాలలోకి ప్రవేశించి అనేక సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగులో కూడా సూరి, ఠాగూర్, గుడుంబా శంకర్, సూపర్, అతడు, రాఖీ, పోకిరీ, దుబాయ్ శీను, నేనింతే, కింగ్, అదుర్స్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా  గెలుచుకున్నారు.

Related Post