టాలీవుడ్ హీరో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై పోలీస్ కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రామవరం వద్ద సర్వే నంబర్స్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణాలను ధ్వంసం చేశారని రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి, మర్రిపాకకు చెందిన సంజయ్లపి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆమె కానీ రవితేజ గానీ ఇంతవరకు స్పందించలేదు.