ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఎస్-6 బోగీలో పొగలు

January 21, 2022
img

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నంబర్ 22415) ఎస్-6 బోగీలో నుంచి పొగలు వస్తున్నట్లు లోకో పైలట్ గుర్తించడంతో వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. ఎస్-6 బోగీ బ్రేకులు పట్టేయడంతో వేడెక్కి పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించి మరమత్తులు చేస్తున్నారు. అన్ని బోగీలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఎటువంటి ప్రమాదం లేదని నిర్దారించుకొని తరువాత ఏపీ ఎక్స్‌ప్రెస్‌ మళ్ళీ బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.      


Related Post