దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన నేపద్యంలో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే మహిళల భద్రత కోసం నిఘా పెంచింది. దాంతో బాటు ఇకపై మహిళలు ఆత్మరక్షణ కోసం తమతో పిప్పర్ స్ప్రే (మిరియాల పొడి) బాటిల్స్ ను తీసుకువెళ్ళేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దిశ ఘటన నేపధ్యంలోనే బెంగళూరు మెట్రోలో కూడా మహిళలు పిప్పర్ స్ప్రే తీసుకువెళ్ళేందుకు అనుమతించింది.