ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రెండు నెలలుగా ఢిల్లీ, తిహార్ జైలులో ఉంటున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరో 6 రోజులు అంటే ఈ నెల 20 వరకు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించింది.
ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది ఆమెపై 8,000 పేజీలతో కూడిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ నమోదు చేశామని న్యాయమూర్తికి తెలియజేశారు. దానిపై ఈ నెల 20వ తేదీన విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు.
రౌస్ అవెన్యూ కోర్టు తన బెయిల్ పిటిషన్లనుతిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై ఈ నెల 24వ తేదీన విచారణ జరుపనుంది.