తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్గా తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్ధసారధి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ళపాటు క్యాబినెట్ హోదాలో కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేసిన తరువాత మొదట చైర్మన్గా బాధ్యతలు చేపట్టియ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టడంతో సమితి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు నియామక ఉత్తర్వులు వెలువడటంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రగతి భవన్ వెళ్ళి సిఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సిఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నేడు లేదా రేపు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.