ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం మెదక్, సిద్ధిపేట జిల్లాలలో తుఫ్రాన్, గజ్వేల్ పట్టణాలలో పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం 10గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీపుల్స్ ప్లాజా వద్ద 102 వైద్య అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా తుఫ్రాన్ కు వెళ్ళి అక్కడ 50 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గజ్వేల్ చేరుకొని అక్కడ జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, సమీకృత కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం, వందపడకల ఆసుపత్రి, శాఖాహార-మాంసాహార మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్ మొదలైన భవనాల నిర్మాణపనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.