రామోజీ సిటీలో 14న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌

November 06, 2025
img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న సినిమా నుంచి అప్‌డేట్స్ లేవని బాధపడుతున్న అభిమానులకు అదిరిపోయే వార్త ఇది. ఈ నెల 14 సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ ఛాంబర్‌ సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఓ భారీ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు రాజమౌళి.

ఈ విషయం తెలియజేస్తూ ఎస్ఎస్ఎంబీ29 ఎటువంటి సినిమాగా తీయాలని ప్రేక్షకులను అడుగుతున్నప్పుడు తీసిన వీడియో క్లిప్ కూడా జోడించారు. 

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్ అవతార్-3 ప్రమోషన్స్‌ కోసం భారత్‌కి రానున్నారు. కనుక నవంబర్‌ 15వ తేదీన హైదరాబాద్‌లో అట్టహాసంగా ఓ కార్యక్రమం నిర్వహించి దానిలో ఆయన చేత ఈ సినిమా టైటిల్‌, పోస్టర్‌ విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలోనే ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ గ్లిమ్స్‌ వీడియో కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.  

ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రియాంకా చోప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబీ29కి ‘వారణాసి’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. 

Related Post