జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన వారిరువురి ఫోటో వైరల్ అవుతోంది. ఈసారి అమెరికాలో షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఇటీవల జూ.ఎన్టీఆర్ హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్ళి కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్తో భేటీ అయ్యారు. అమెరికాలో సినిమా షూటింగ్ చేసుకోబోతునందుకు ఆమె జూ.ఎన్టీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తెలియజేస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అమెరికాలో షూటింగ్ ముగించిన తర్వాత మెక్సికోలో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026, జూన్ 25న విడుదల కాబోతోంది.